Home News కొమరం భీమ్ జిల్లా: ఎస్సీ సామాజిక వర్గం వారిపై దాడి.. 8 మందిపై కేసు

కొమరం భీమ్ జిల్లా: ఎస్సీ సామాజిక వర్గం వారిపై దాడి.. 8 మందిపై కేసు

0
SHARE

కొమరం భీమ్ జిల్లా సిర్పూర్ కాగజనగర్ పట్టణం విజయబస్తీలో ఇరువర్గాల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం ఎస్సీ సామాజిక వర్గం వారిపై దాడికి దారితీసింది.

పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గతంలో జరిగిన స్వల్ప వివాదాన్ని మనసులో పెట్టుకున్న షారుక్, నడ్డు, ఇమ్రాన్, మబ్బు, నజీమ్, నషీమ్, అబీద్, సలీంలు మరి కొందరితో కలిసి సోమవారం రాత్రి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి ఇంటిపై కర్రలతో దాడి చేశారు. ఈ సందర్భంగా నిందితులు రాజేష్ కుటుంబ సభ్యులు, మహిళలను కులంపేరుతో దూషిస్తూ వారిని కర్రలతో గాయపరిచారు.

దీంతో సోమవారం రాత్రి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఘటనకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన 8 మంది వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు, లాక్-డౌన్ అమలులో ఉన్నందున విపత్తు నివారణ, అంటువ్యాధుల నివారణ చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.