Home News రాజ్యాంగం, సైన్యం, ఆర్ ఎస్ ఎస్ భారత్ ను సురక్షితంగా ఉంచుతున్నాయి – మాజీ సుప్రీం...

రాజ్యాంగం, సైన్యం, ఆర్ ఎస్ ఎస్ భారత్ ను సురక్షితంగా ఉంచుతున్నాయి – మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కెటి థామస్

0
SHARE
ఆర్ ఎస్ ఎస్ శిక్షా వార్గలో ప్రసంగిస్తున్న జస్టిస్ కే టి థామస్

“భారత్ లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్ ఎస్ ఎస్ వల్ల అని సమాధానం చెపుతాను’’ అని జస్టిస్ కెటి థామస్ అన్నారు. కేరళలోని  కొట్టాయంలో ఆదివారం (31 డిసెంబర్) నాడు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాథమిక శిక్షవర్గ (శిక్షణ కార్యక్రమం) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జస్టిస్ థామస్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పనిచేశారు.

ఆర్ ఎస్ ఎస్ తమ కార్యకర్తలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందిస్తోందని జస్టిస్ థామస్ ప్రశంసించారు. “భారత్ లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్ ఎస్ ఎస్ వల్ల అని సమాధానం చెపుతాను. ఇలా చెప్పడానికి కారణం ఉంది. ఆర్ ఎస్ ఎస్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసింది. ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న వ్యవస్థీకృతమైన, పటిష్టవంతమైన పని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టికి వెళ్లింది. ఎమర్జెన్సీని ఎక్కువకాలం పొడిగించలేమని ఆమెకి అర్ధమైంది’’ అని ఆయన అన్నారు. “ఎమర్జన్సీ నుండి దేశాన్ని కాపాడిన ఘనత ఆర్ ఎస్ ఎస్ కే దక్కుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.

“హిందూ అనే మాట నిజానికి హిందూస్థాన్ లోని సంస్కృతిని చెపుతుంది. ఒకప్పుడు హిందూస్థాన్ అనే మాట అందరిలో స్ఫూర్తిని కలిగించేది. కానీ ఇప్పుడు దానికి కేవలం ఆర్ ఎస్ ఎస్ , బి జి పి లకే పరిమితం చేస్తున్నారు’’ అని జస్టిస్ థామస్ అన్నారు.

సెక్యులరిజం గురించి ప్రస్తావించిన ఆయన రాజ్యాంగంలో ఎక్కడ సెక్యులరిజం నిర్వచనం లేదని అన్నారు. “సెక్యులరిజాన్ని మైనారిటీలు తమకోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ దానికి మరింత విస్తృతమైన అర్ధం ఉంది. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడడమే సెక్యులరిజం అవుతుంది. సంకుచితమైన ప్రయోజనాలు, కార్యకలాపాలకంటే ఇది ముఖ్యం’’ అని ఆయన అన్నారు. మతాన్ని పరిరక్షించడం సెక్యులరిజం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

“రాజ్యాంగంలో సెక్యులరిజం ఐదవ స్థానంలో ఉంది – వ్యక్తి ప్రాధమిక హక్కుల తరువాత మత హక్కు వస్తుంది” అని స్పష్టం చేశారు.

భారత్ లో మాత్రమే మైనారిటీ కమిషన్ కనిపిస్తుందని, రాజ్యాంగంలో ఎక్కడ మైనారిటీల గురించి నిర్వచనం లేదని అన్నారు. భారత్ లో మైనారిటీ అంశం మతం, జనాభాను బట్టి నిర్ధారితమవుతుందని అంటూ “మెజారిటీ ప్రజానీకానికి లేని హక్కులు తమకు కావాలని కోరుకున్నప్పుడే మైనారిటీలలో అభద్రతాభావం కలుగుతుంది’’ అని అన్నారు.

1979లో కోజీకోడ్ జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మొదట సారి ఆర్ ఎస్ ఎస్ పట్ల సదభిప్రాయం కలిగిందని, నిరాడంబర జీవనం, ఉన్నతమైన ఆలోచన ఆర్ ఎస్ ఎస్ లో కనిపిస్తాయని జస్టిస్ థామస్ అన్నారు. “నేను జన్మతహా క్రైస్తవుడిని. చర్చికి వెళతాను. అయినా ఆర్ ఎస్ ఎస్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాను’’ అని ఆయన వెల్లడించారు.

చివరగా, కొంతమంది స్వార్ధ ప్రయోజనాల కోసం ఆర్ ఎస్ ఎస్ పై సాగిస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు.