Home News దేశ ప్రతిష్ఠను పెంచిన ‘డోక్లామ్‌’: ఆరెస్సెస్‌ ప్రశంసలు

దేశ ప్రతిష్ఠను పెంచిన ‘డోక్లామ్‌’: ఆరెస్సెస్‌ ప్రశంసలు

0
SHARE

నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు చర్యను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఆదివారం నాడిక్కడ గట్టిగా సమర్ధించింది. మున్ముందు ఈ చర్య దేశానికి ఎంతో మేలు చేస్తుందని ఆరెస్సెస్‌ ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య పేర్కొన్నారు. డోక్లామ్‌ సమస్య విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు శ్లాఘనీయమన్నారు. డోక్లామ్‌ నుంచి చైనా దళాలు వైదొలగడం భారత ప్రతిష్ఠను ఇనుమడింప చేశాయని వైద్య అభిప్రాయపడ్డారు. గతంలో ఏనాడూ కూడా చైనా ఈ తరహాలో స్పందించలేదని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే…భారత సాయుధ దళాల ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పైకి ఎగబాకిపోయిందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన ఆరెస్సెస్‌ సమన్వయ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీ ఉత్పత్తుల బహిష్కరణకు ఉద్యమించే విషయంలో స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

(ఈనాడు సౌజన్యం తో)