Home News ధర్మ పరిరక్షణకే ధర్మజాగరణ కార్యక్రమాలు

ధర్మ పరిరక్షణకే ధర్మజాగరణ కార్యక్రమాలు

0
SHARE

ఇది హిందూదేశం. ఇక్కడ అధిక సంఖ్యాకులు హిందువులు. వేల సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సంస్కృతి విలసిల్లుతోంది. భారతీయులు లేదా హిందువులు ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తి, దానిని ఆక్రమించుకోలేదు. ఎవరిని బానిసలను చేయలేదు. లక్షల సంఖ్యలో హతమార్చలేదు. విశ్వమంతా ఒక కుటుంబమేనని భావించారు.

కానీ తమ మతమే గొప్పదని, ప్రపంచమంతా దానినే అనుసరించాలను కునే సెమెటిక్‌ మతాలు పుట్టుకు వచ్చి సుసంపన్నమైన ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాయి. ప్రపంచంలో ఏ దేశంపైన జరగనన్ని దాడులు ఈ దేశంపై జరిగాయి. విదేశీ దురాక్రమణకారులు ఇక్కడి సంపదను దోచుకున్నారు. పెద్దయెత్తున మారన కాండ సృష్టించారు. దేవాలయాలను ధ్వంసంచేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తరువాత ఈ విదేశీ దురాక్రమణ స్వరూపం మారింది. నేరుగా దాడి చేయడానికి వీలులేదుకాబట్టి పరోక్షపద్దతులు ఎంచుకున్నారు. తమ జన సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఈ అక్రమణను కొనసాగించాలనుకున్నారు. అందుకు తమ జనాభాను పెంచుకోవడం, మరోపక్క హిందువులను తమ మతంలోకి మార్చడం అనే రెండు రకాల వ్యూహాన్ని అనుసరించారు.

జనాభా సంతులనం దెబ్బతిన్న ప్రదేశాలన్నిటిలో హిందువుల పరిస్థితి దిగజారింది. 120 సంవత్స రాల జనాభా వివరాలను పరిశీలిస్తే మనకు అనేక ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించే విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం సాగుతున్న విధంగానే  ముస్లిం, క్రైస్తవుల జనాభా పెరిగి, హిందువుల సంఖ్య తగ్గుతూ పోతే 2051 నాటికి ముస్లిములు, క్రైస్తవుల జనాభా హిందూ జనసంఖ్యతో సమానమైపోతుంది.

మతమార్పిడి వల్ల కూడా హిందూ జనాభా తగ్గి పోతోంది. అనేకమంది ప్రముఖులు మత మార్పిడులు అనైతికమైనవి, అధార్మికమైనవి, దేశ సమైక్యతకు, సమగ్రతకు గొడ్డలిపెట్టని అన్నారు.

– క్రైస్తవ చర్చ్‌ విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కార్యక్రమాల ద్వారా మతం మారుస్తూ ఉంటే నేను తప్పనిసరిగా క్రైస్తవులను ఈ దేశం వదలి వెళ్లి పొమ్మని చెప్తాను

                            – గాంధీజీ

– ఒక హిందువు మతం మారితే, హిందువుల సంఖ్య తగ్గినట్లేకాదు, ఒక శత్రువు పెరిగినట్లు

   –  స్వామి వివేకానంద

– ఇస్లాం లేక క్రైస్తవ మతాలలోకి మారడం దళిత వర్గాలను జాతీయతా భావనకు దూరం చేస్తుంది

                   – డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

ఈ మతమార్పిడుల వల్ల కలిగే దుష్పరిణా మాలను అడ్డుకునేందుకు ధర్మజాగరణ సమితి గత 15 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎంతో విజయాన్ని సాధించింది కూడా.

పునరాగమనం

మతమార్పిడిని ఎదుర్కొనడానికి  ప్రధానమైన కార్యక్రమం పునరాగమనం. ఏదైనా కారణం వల్ల స్వధర్మాన్ని వదలి ఇతర మతాలకు వెళ్ళినవారిని తిరిగి తీసుకువచ్చే కార్యక్రమమే పునరాగమనం. అలా సొంత గూటికి రావాలనుకునేవారితో హోమ కార్యక్రమం చేయిస్తారు. దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ వస్తారు. పొరపాటున దారితప్పిపోయిన సోదరులను సాదరంగా సొంత ఇంటికి ఆహ్వానిస్తారు. పునరాగమనం చేసినవారు తిలకం ధరించడం, గాజులు వేసుకోవడం మొదలైన హిందూ పద్దతులను తిరిగి పాటించడం మొదలుపెడతారు. తాము ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో స్వమతానికి దూరమైనది ఇతరులకు వివరిస్తారు. తమలాగా ఎవరు ప్రలోభాలకు లోనుకాకూడదని సూచిస్తారు.

స్వామీజీల పాదయాత్రలు

గ్రామాలు, తండాలలో హిందూధర్మానికి ప్రతినిధులైన స్వామీజీల పాదయాత్రలు కూడా ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. స్వామీజీలు, ధర్మాచార్యులు ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబాలను దీవించి, ఇళ్ళలో ధర్మ జ్యోతిని వెలిగిస్తున్నారు. స్వామీజీలు స్వయంగా తమ ఇళ్లకు రావడం పట్ల అంతా ఎంతో సంతోషిస్తున్నారు. ఇది వారిలో స్వధర్మ నిష’ను మరింత పెంచుతోంది.

పూజారుల వర్గ

గ్రామంలో ఉన్న చిన్న దేవాలయంలో కూడా నిత్యం పూజలు చేసేవారులేక అనేక గుళ్ళు వెలవెల బోతున్నాయి. అలాంటి ఆలయాలలో వెలుగులు నింపేందుకు, పూజలు జరిపించడానికి స్థానికులకే పూజారులుగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ధర్మజాగరణ సమితి చేపట్టింది. ప్రతిసంవత్సరం నిర్వహించే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలలో ఇప్పటివరకు 2వేలకు పైగా పూజారులుగా శిక్షణ పొందారు. వీరు గ్రామదేవతల ఆలయాల్లో పూజలు జరిపించ డమేకాక గ్రామాలలో ధార్మిక వాతావరణాన్ని నెలకొల్పి మతమార్పిడులను ఆపగలుగుతున్నారు.