Home News విదేశీ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి: ఆర్.ఎస్.ఎస్ దృక్పధాన్ని వివరించిన పూ. సర్ సంఘచాలక్ 

విదేశీ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి: ఆర్.ఎస్.ఎస్ దృక్పధాన్ని వివరించిన పూ. సర్ సంఘచాలక్ 

0
SHARE

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్  శ్రీ మోహన్ భాగవత్ గారు ఈ రోజు న్యూఢిల్లీలో దాదాపు 30 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 50కి పైగా మీడియా సంస్థలకు చెందిన 80 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

సమాజంలోని వివిధ రంగాలకు చెందినవారితో సర్ సంఘ్ చాలక్ నిరంతరం జరిపే నిర్మాణాత్మకమైన చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది.  రెండున్నర గంటలపాటు జరిగిన ఇష్టాగోష్టిలో మోహన్ భాగవత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృక్పథాన్ని, దార్శనికతను భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో వైవిధ్యమైన అంశాలపై విస్తృత చర్చ జరిగింది.

ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ సురేష్ (భయ్యాజీ) జోషి గారు, సహ్ సర్ కార్యవాహ్ డాక్టర్ మన్మోహన్ వైద్య గారు, డాక్టర్ కృష్ణ గోపాల్ గారు, ఉత్తర క్షేత్ర సంఘ్ చాలక్ డాక్టర్ బజరంగ్ లాల్ గుప్తాగారు, ఢిల్లీ ప్రాంత సంఘ్ చాలక్ కులభూషణ్ ఆహూజా గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


అరుణ్ కుమార్
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
సెప్టెంబర్ 24, 2019