Home News హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసు నిందితుడి అరెస్ట్

హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసు నిందితుడి అరెస్ట్

0
SHARE
కర్ణాటక రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా ఆరెస్సెస్, ఇతర సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసులో పురోగతి లభించింది. ఈ హత్యలకు సంబంధించి కీలక నిందితుడు అహ్మద్ షరీఫ్ అలియాస్ లష్కర్ మొహల్లాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం మైసూరులో అరెస్ట్ చేశారు.
2016 మైసూరు సమీపంలోని క్యాతమరణహళ్లిలో రాజు అనే హిందూ కార్యకర్త హత్యకు సంబంధించి పోలీసులు చేస్తున్న విచారణ సందర్భంగా మిగిలిన హత్య ఘటనల్లో కూడా నిందితుడు అహ్మద్ షరీఫ్ పాత్ర ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
లష్కర్ మొహల్లా ప్రాంతానికి చెందిన  అహ్మద్ షరీఫ్ ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నలుగురు హిందూ కార్యకర్తల హత్యల కేసులో నిందితుడిగా గుర్తించినట్టు మైసూరు నగర పోలీస్ కమిషనర్ పీటీఐ వార్తా సంస్థకు తెలియజేసారు.
అహ్మద్ షరీఫ్ జాతీయవాద సంస్థలకు చెందిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తించినట్టు పోలీసులు వర్గాల ద్వారా సమాచారం.