Home News అమరులైన సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి  

అమరులైన సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి  

0
SHARE

ప్రకటన 

దేశ సమైక్యత, సార్వభౌమత్వం, గౌరవాలను కాపాడేందుకు లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో విధినిర్వహణలో సర్వోన్నతమైన త్యాగాన్ని చేసిన వీరులైన సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. భారత ప్రజానీక తరఫున అమరులైన సైనికుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాము. చైనా ప్రభుత్వపు, సైన్యపు ఈ హింసాత్మక, దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రజలమైన మేము సైనిక దళాలు, ప్రభుత్వానికి పూర్తి సంఘీభావాన్ని , మద్దతును తెలుపుతున్నాము

Source: www.rss.org