Home News హైదరాబాద్ మదర్సా లో విద్య పేరుతో చిన్నారులపై లైంగిక వేధింపులపు పాల్పడుతున్న ముస్లిం మౌల్వి

హైదరాబాద్ మదర్సా లో విద్య పేరుతో చిన్నారులపై లైంగిక వేధింపులపు పాల్పడుతున్న ముస్లిం మౌల్వి

0
SHARE
  • ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
  • తల్లిదండ్రులకు ఎనిమిదేళ్ల బాలిక ఫిర్యాదు
  • హైదరాబాద్‌లో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి
  • మదర్సా వద్దకు వెళ్లిన విలేకరులపై రాళ్ల దాడి

మదర్సాలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక మౌల్వీ.. వారిపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడు! హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్‌ జీబాబాగ్‌ ప్రాంతంలోని జమీయా ఉల్‌ ఉలూమ్‌ మదర్సాలో జరిగిన ఈ దారుణం ఒక విద్యార్థి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదర్సాలో ఉపాధ్యాయుడు ఎండీ రియాన్‌ (28) కొంతకాలంగా పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇతను బిహార్‌కు చెందిన వ్యక్తి కాగా.. మదర్సాలో బిహార్‌ నుంచి వచ్చిన వారి పిల్లలు ఎక్కువగా విద్యనభ్యసిస్తుంటారు. కొద్దిరోజులుగా అతడి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో ఒక బాలిక (8).. అతడి అకృత్యాలపై తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ కీచక టీచర్‌ నిర్వాకం బయటపడింది. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు ఆసిఫ్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడు ఎండీ రియాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇలా ఆరు నుంచి ఎనిమిది ఏళ్ల వయసున్న ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆరుగురు చిన్నారులనూ కౌన్సెలింగ్‌కు పంపినట్లు వెల్లడించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 377, 506.. పోక్సో చట్టంలోని 5, 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

కాగా, మదర్సా ఉపాద్యాయుడి నిర్వాకం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు సంఘటన స్థలానికి వెళ్లిన పలువురు స్థానికులపైన, విలేకరులపైనా అక్కడివారు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో విలేకరులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)