Home News పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంతం చేయడంలో స్వయంసేవకుల పాత్ర

పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంతం చేయడంలో స్వయంసేవకుల పాత్ర

0
SHARE

బ్రిటిష్ వారు వైదొలిగినంత మాత్రాన స్వాతంత్య్ర పోరాటం ముగిసిపోలేదు. 1954 ఆగస్ట్ 2వ తేదీన మిగిలి ఉన్న పోర్చుగీసు స్థావరలైన దాద్రా-నగర్హ, హవేలీలలోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణె సంఘచలాక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఆ బృంధంలో అనేక మంది ప్రముఖులైన సంఘ కార్యకర్తలు ఉన్నారు. గొరిల్లా వ్యూహాన్నిరూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్ర కార్యాలయంపై  దాడి చేసి, అక్కడి 175 మంది సైనికులు భేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు వారు. జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఆదే రోజన ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఆ చారిత్రాత్మక సంఘటన యొక్క రజతోత్సవ సందర్భంగా 1979 ఆగుస్ట్ 2వ తేదీన సెల్వాసా ప్రజలు ఆ వంద మంది స్వాతంత్య్ర వీరులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి సత్కరించింది.

అప్పటికి ఇంకా గోవాపై పోర్చుగీసువారి ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.  1955లో పనాజీ సచివాలయం మీద మొట్టమొదటి సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి గోవాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న ఒక స్వయంసేవక్. 1961లో ‘గోవా విముక్తం’ అయిన తరువాత కూడా మొత్తం 17 సంవత్సరాల పాటు ఆయన లిస్భన్ జైలులో ఉన్నాడు. 1955లో గోవా విముక్తికై అన్ని రాజకీయపక్షాలు కలిసి సాగించిన జాతీయ పోరాటంలో స్వయంసేవకులు ప్రధాన పాత్ర నిర్వహించారు. దేశం నలుమూలల నుండి  వెల్లువలా వస్తున్న సత్యాగ్రహాలకు గోవా  సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. సంఘ్ మరియు జనసంఘానికి చెందిన ప్రముఖ కార్యకర్తలు అనేక సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించారు. వారిలో అనేకులు తుపాకి గుండ్ల  దెబ్బలు తిన్నారు. పోర్చుగీసు జైళ్ళలో అమానుష చిత్రహింసలను అనుభవించారు.

సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన ప్రముఖ స్వయంసేవకులలో మద్యభారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాభావు మహంకాళ్ ఒకరు. సరిగ్గా సరిహద్దుల్లోనే పోర్చుగీస్ పోలీసులు తమ తుపాకులు, తూటాలతో ఈ సత్యాగ్రహాలకు ‘స్వాగతం’ పలుకడానికి సిద్దంగా ఉన్నారు.  రాజాభావు గోవా సరిహద్దు వైపు సాగుతున్నంతలోనే సత్యాగ్రహుల మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి. వారు గాయపడి నేలకూలారు. మూడు వరుసలలో ఉన్న సాగర్ ప్రాంతానికి చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి క్రింద పడిపోగానే  రాజాభావు ఆమె చేతుల్లోని త్రివర్ణపతకాన్ని తానందుకుని ‘భారత మాతాకీ జయ్’ అని గర్జిస్తూ ముందుకు దూకారు. అంతలోనే దూసుకువచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేలకూలారు. స్పృహలో ఉన్న కొద్ది క్షణాలలోనే పతాకాన్ని, గాయపడిన సత్యగ్రహులను జాగ్రత్తగా చూసుకోమని ఇతరులకు ఆదేశాలు ఇచ్చారు. మరికొన్ని నిమిషాలలోనే మాతృభూమి స్వాతంత్య్ర సాధనా కార్యంలో అజరామరమైన ఘనతను సాధించుకున్న అమరవీరుల వరుసలో వారు కూడా చేరిపోయారు.

 పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంతం చేయడంలో….

బ్రిటిష్ వారు వై దొలిగినంత మాత్రాన స్వాతంత్ర్య పోరాటం ముగిసిపోలేదు. 1954ఆగుస్ట్ 2వతేదీన మిగిలిఉన్న పోర్చుగీసు స్థావరలైన దాద్రా, నగార్ హవేలీల లోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణే సంఘచలాక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది.ఆబృంధంలో అనేకమంది ప్రముకులైన సంఘకార్యకర్తలు ఉన్నారు. గొరిల్లా వ్యూహాన్నిరూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్రకార్యాలయంపై  దాడి చేసి , అక్కడి175 మంది సైనికులు భేషరతుగా లొంగి పోయేటట్లు చేశారు వారు. జాతీయత్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఆదేరోజన ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఆ చారిత్రాత్మక సంఘటన యొక్క రజతోత్సవ సందర్భంగా1979 ఆగుస్ట్ 2వ తేదీన సెల్వాసా ప్రజలు ఆ వందమంది స్వాతంత్ర్యవీరులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. 1987లో  మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని   స్వాతంత్ర్యసమరయోధులుగా గుర్తించ సత్కరించింది.

అప్పటికి ఇంకా గోవాపై పోర్చుగీసువారు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.  1955లో పనాజీ సచివాలయం మీద మొట్టమొదటి సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి గోవాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న ఒక స్వయంసేవక్. 1961 లో గోవా విముక్తం’ అయిన తరువాత కూడా మొత్తం 17 సం||లపాటు ఆయన లిస్భన్ జైలులో ఉన్నాడు. 1955లో గోవావిముక్తికై అన్ని రాజకీయపక్షాలు కలిసి సాగించిన జాతీయపోరటంలో స్వయంసేవకులు ప్రధానపాత్ర నిర్వహించారు. దేశం నలమూలలనుండి  వెల్లువలా వస్తున్న సత్యాగ్రహాలకు గోవా  సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వెసుకున్నారు. సంఘానికి, జనసంఘనికి చెందిన ప్రముఖ కార్యకర్తలు అనేక సత్యాగ్రహ బృందాలకునాయకత్వం వహించారు. వారిలో అనేకులు తుపాకి గుండ్ల  దేబ్బలుతిన్నారు. పోర్చుగీసు జైళ్ళలో అమానుష చిత్రహింసలను అనుభవించారు.

సత్యాగ్రహబృందాలకు నాయకత్వం వహించిన ప్రముక స్వయంసేవకులలో మద్యభారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాభావు మహంకాళ్ ఒకరు. సరిగ్గా సరిహద్దుల్లోనే పోర్చుగీస్ పోలీసులు తమ తుపాకులు, తూటాలతో ఈ సత్యాగ్రహాలకు ‘స్వాగతం’ పలుకడానికి సిద్దంగా ఉన్నారు.  రాజాభావు గోవా సరిహద్దువైపు సాగుతున్నంతలోనే సత్యాగ్రహుల మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి. వారు గాయపడి నేలకూలారు. ముడువరుసలలోఉన్న సాగర్ కు చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి క్రింధపడిపోగానే  రాజాభావు ఆమె చేతులోని త్రివర్ణపతకాన్ని తానందుకుని ‘భారతమాతాకీజయ్’ అని గర్జిస్తూ ముందుకు దూకారు. అంతలోనే దూసుకువచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేలకూలారు. స్ప్ర్హుహలో ఉన్న కొద్దిక్షణాలలోనే పతాకాన్ని, గాయపడిన సత్యగ్రహులను జాగ్రత్తగా చూసుకోమని ఇతరులకు ఆదేశాలుఇచ్చారు. మరికొన్ని నిమిషాలలోనే మాతృభూమి స్వాతంత్ర్యసాధనా కార్యంలో అజరామరమైన ఘనతను సాధించుకున్న అమరవీరులవరుసలో వారుకూడా చేరిపోయారు.

‘ఆర్.యస్.యస్.. ఆకృతి దాల్చిన ఆదర్శం’ నుండి సేకరణ..