Home News ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ లో ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థినుల క్రైస్తవ మతమార్పిడికి...

ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ లో ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థినుల క్రైస్తవ మతమార్పిడికి యత్నించిన ప్రిన్సిపాల్

0
SHARE

ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హుత్నూర్ మండలంలోని ​ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మంది విద్యార్థులను వారి వసతి గృహం నుండి ఎలాంటి అనుమతి లేకుండా స్కూల్  ప్రిన్సిపాల్ లావణ్య ​ఆదివారం నాడు (14-జూలై) నాడు ​స్థానిక చర్చి​లోని  ప్రార్ధనకు తీసుకొని వెళ్ళింది.

ఈ విషయాన్నీ తెలుసుకున్న గ్రామస్తులు చర్చి వద్దకు వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహార శైలిని, అమాయక పిల్లల చేత క్రైస్తవ మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న ఆమెను కలిసి నిలదీసారు.

ఈ విషయం తెలుసుకున్న వి హెచ్ పి, భజరంగ్ దళ్ , బి జే పి కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. వసతి గృహం నుండి నియమాలకు విరుద్ధంగా విద్యార్థులను గత మూడు అదివారముల నుండి ​చర్చ్ కి తీసుకొని వెళ్లి అక్కడ మత మార్పిడికి ప్రయత్నం చేస్తున్న ప్రిన్సిపాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సంఘటనపై బజార్ హుత్నూర్ గ్రామస్తులు డి ఎస్ప్ నరసింహ రెడ్డి , డి ఈ ఓ జనార్ధన్ రావు కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు చర్చ్ వద్దకు చేరుకొని విచారణ జరిపారు.

గ్రామస్తులు, ప్రిన్సిపాల్ కి మద్య జరిగిన వాగ్వివాదం తరువాత పోలీసులు, విద్య శాఖా అధికారులు ఈ విషయం పై సమగ్ర దర్యాప్తు చేసి పై అధికారులకు వివరిస్తామని తెలియచేసారు. 

Image Courtesy: Namaste Telangana

 

ఈ విషయం పై అధికారులు విచారణ చేసిన తరువాత ప్రిన్సిపాల్ లావణ్య ను కలెక్టర్ ఆమెను విధుల నుంచి తొలగించారు.