Home News ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి – జవాన్లపై ఉగ్రవాద దాడి ఘటనపై ఆరెస్సెస్ సర్...

ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలి – జవాన్లపై ఉగ్రవాద దాడి ఘటనపై ఆరెస్సెస్ సర్ కార్యవాహ ప్రకటన

0
SHARE

జమ్ము కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఉగ్రవాదుల భయాన్ని ఈ సంఘటన చూపుతోంది. ఈ దాడికి పాల్పడినవారిపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా, అత్యంత కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ విపత్కర స్థితిలో రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ ప్రభుత్వం, అలాగే భద్రతా దళాలకు అండగా నిలుస్తుంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు వినమ్ర శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాము. అలాగే వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

– సురేశ్ జోషి, సర్ కార్యవాహ, రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్.