Home News ప‌ట్టుబ‌డిన పాకిస్థాన్ ఉగ్ర‌వాది.. మ‌రొక‌రు హ‌తం

ప‌ట్టుబ‌డిన పాకిస్థాన్ ఉగ్ర‌వాది.. మ‌రొక‌రు హ‌తం

0
SHARE

ల‌ష్క‌రే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్ర‌వాదిని భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌ట్టుకున్నాయి. జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఉరి ద‌గ్గ‌ర నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి జ‌రిపిన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్‌లో మ‌రో ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చారు. ప‌ట్టుబ‌డిన ఉగ్ర‌వాది పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన‌వాడు. త‌న పేరు అలీ బాబ‌ర్ పాత్రా అని అత‌డు చెప్పిన‌ట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ వీరేంద్ర వెల్ల‌డించారు. తాను ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదిన‌ని, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ముజ‌ఫ‌రాబాద్‌లో త‌న‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు అత‌ను విచార‌ణ‌లో చెప్పాడు. గ‌త ఏడు రోజులలో ఏడుగురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ తెలిపింది.

పాకిస్థాన్ ఆర్మీ సాయం లేకుండా స‌రిహ‌ద్దులో ఇంత మంది క‌ద‌లిక‌లు అసాధ్య‌మ‌ని, నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న అన్ని ఉగ్ర‌వాద స్థావ‌రాల్లో క‌ద‌లిక‌లు ఉన్నాయ‌ని మేజ‌ర్ వీరేంద్ర చెప్పారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో పాకిస్థాన్‌తో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం త‌ర్వాత నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఇండియ‌న్ ఆర్మీ సాగించిన అతి పెద్ద ఆప‌రేష‌న్ ఇదే. ఈ నెల 18 నుంచి ఈ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. గ‌త మూడు రోజుల‌లో న‌లుగురు జ‌వాన్లు కూడా గాయ‌ప‌డ్డారు.