Home News గోమాత‌ల‌ అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట‌

గోమాత‌ల‌ అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట‌

0
SHARE

రాంబన్: గోమాత‌ల‌ అక్ర‌మ ర‌వాణాను పోలీసులు అడ్డుకున్నారు. జ‌మ్మూక‌శ్మీర్ ప‌రిధి, రాంబ‌న్ జిల్లాలో నిత్యం ప‌శువుల అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంది. దీనిని అడ్డుకునేందుకు రాంబ‌న్‌, చందర్‌కోట‌, బ‌టోటే ప్రాంతాల పోలీసు బృందాలు ఏక‌మై త‌మ త‌మ ప‌రిధిలో ప‌టిష్ఠ‌మైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశాయి. ఎప్ప‌టిలాగే వాహ‌నాలు త‌నిఖీ చేయ‌గా క‌శ్మీర్ వెళ్ళే 13 వాహ‌నాల్లో 54 పశువుల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. ఆ వాహ‌నాలను సీజ్ చేసి నిందితుల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

Source : ORGANISER