Home News “ఇస్లాంలోకి మారకపోతే చంపేస్తాం”: టీవీ ఛానెల్ కి ఐసిస్ నుంచి బెదిరింపులు

“ఇస్లాంలోకి మారకపోతే చంపేస్తాం”: టీవీ ఛానెల్ కి ఐసిస్ నుంచి బెదిరింపులు

0
SHARE
సమాజాన్ని జాగృతం చేస్తూ జాతీయవాద భావనలను ముందుకు తీసుకెళ్తున్న కేరళకు చెందిన జనమ్ టీవీకి అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్  స్టేట్ (ఐ.ఎస్.ఐ.ఎస్) నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి.

OpIndia కధనం ప్రకారం..  “జనమ్ టీవీకి ముజాహిదీనుల సందేశం” పేరుతో ఇన్స్టాగ్రామ్ సామజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా.. ఇస్లాం మతంలోకి మారాడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని, లేనిచో చానల్ కార్యాలయాలను నాశనం చేస్తామని, చానెల్ లో పనిచేసే ఉద్యోగులను చంపుతామని ఉగ్రవాద సంస్థ బెదిరిస్తున్నట్లుగా మలయాళంలో రాసిన పోస్టులో ఉంది.

కేరళలో జాతీయవాద భావాలను ముందుకు తీసుకువెళ్తున్న జనం వార్తా ఛానెల్ ప్రస్తుతం టిఆర్పి రేటింగులో ముందంజలో ఉన్న కేరళ లోని ఐదు మలయాళ ఛానళ్లలో ఒకటిగా ఉంది.వామపక్ష మీడియా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ జాతీయవాద దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జనంటీవీ కృషి చేస్తోంది.

ఉగ్రవాద సంస్థల నుండి వస్తున్న బెదిరింపుల దృష్ట్యా జనం టీవీ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర డిజిపి లోక్ నాథ్ బెహ్రా పోలీసు శాఖను ఆదేశించారు.
https://twitter.com/tvjanam/status/1284431990809223168