Home News గంజాయి పీల్చొద్దు అన్నందుకు గిరిజన యువకుడిపై ముస్లింల దాడి.. ఆపై హత్య

గంజాయి పీల్చొద్దు అన్నందుకు గిరిజన యువకుడిపై ముస్లింల దాడి.. ఆపై హత్య

0
SHARE

తన ఇంటి ఎదుట గంజాయి పీల్చొద్దు అన్నందుకు గిరిజన యువకుడిపై ముస్లింలు దాడి చేసి హత్య చేసిన వైనం ఇది. 

జార్ఖండ్ రాష్ట్రం రాంచీ సమీపంలోని అర్గోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖడ్రు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

స్థానిక గిరిజన యువకుడైన మాంగ్రూ పహల్ కార్మిక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి  ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. మాంగ్రు కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ పొరుగునే ఉంటున్న కొందరు ముస్లిం యువకులు తమ ఇంటి ముందుకు వచ్చి గంజాయి పీలుస్తుండగా, వాసన గమనించిన మాంగ్రు దయచేసి ఇలా మా ఇంటి ముందు పీల్చవద్దని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు మాంగ్రూపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యచేశారు.

దాడి జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు మాంగ్రూను సమీపంలోని రిమ్స్ ఆస్పత్రికి వైద్యం కోసం తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలియజేసారు. 

గతంలోనూ వారు తరచూ తమ ఇంటి ముందుకు వచ్చి ఇలాగె ప్రవర్తించేవారని మాంగ్రో కుటుంబీకులు తెలియజేసారు. ఘటనకు సంబంధించి పోలీసులు మహ్మద్ సాజిద్ అలియాస్ చోటు, అజామ్ అన్సారీ అలియాస్ బాబు, రంజాన్ అన్సారీ అలియాస్ చూత్రి అనే నిందితులను అరెస్ట్ చేసారు.

Source: Organiser