Home News వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ రికార్డు… 70కోట్ల టీకా డోసులు పూర్తి 

వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ రికార్డు… 70కోట్ల టీకా డోసులు పూర్తి 

0
SHARE
​కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకుగాను ప్రారంభించిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ భార‌త్‌లో చాలా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 కోట్ల టీకాలు ఇచ్చి రికార్డు సృష్టించామంటూ.. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్​సుఖ్ మాండవియా మంగళవారం వెల్లడించారు.
“ఇప్పటి వరకు 70 కోట్ల టీకా డోసులు ఇచ్చాము. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలకు, ప్రజలకు అభినందనలు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దిగ్విజయంగా 70 కోట్లకు చేరుకుంది.” అంటూ మాండవీయా ట్వీట్‌ చేశారు.

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశలు వారిగా ఈ వ్యాక్సినేషన్‌​ ప్రక్రియ చేపట్టింది. మొదటి ద‌శ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలతో  ప్రారంభించారు. ఫిబ్రవరి 2న బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు టీకా వేశారు. తదుపరి ద‌శ‌ల్లో  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను (45 ఏళ్లు నుంచి 60ఏళ్లు) మార్చి1న ప్రారంభించారు. తదనంతరం ఏప్రిల్‌​ 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికి టీకాలు వేశారు.
అయితే వ్యాక్సినేష‌న్  ప్ర‌క్రియ ప్రారంభంలో కొంత‌మంది అనుమానాలు, సందేహాలు వ్య‌క్తం చేశారు. భార‌త్ వంటి దేశంలో అంద‌రికీ వ్యాక్సినేష‌న్ అంత తొంద‌ర జ‌ర‌గ‌ద‌ని అపోహాలు సృష్టించారు. కానీ దేశంలోని అనేక మంది శాస్త్రవేత్త‌లు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఇత‌ర ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ వారి కృషి వ‌ల్ల  నేడు 70కోట్ల‌ వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుని భార‌త్ రికార్డు సృష్టించింది. గ‌డిచిన 13రోజ‌ల్లోనే 10 కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. ఈ లెక్క‌న ఈ ఏడాది చివ‌రికి వ‌ర‌కు 100 కోట్ల‌కు పైగా వ్యాక్సినేష‌న్ పూర్తవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.