Home News ఆంధ్ర‌ప్ర‌దేశ్: అక్ర‌మ మ‌సీదు నిర్మాణంపై గ్రామ‌స్తుల నిరస‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్: అక్ర‌మ మ‌సీదు నిర్మాణంపై గ్రామ‌స్తుల నిరస‌న

0
SHARE

ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించ తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

విశాఖ జిల్లా, పెందుర్తి ఆశ్రమం అధిపతి భారతీనంద స్వామీజీ ఆధ్వర్యంలో బొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, అక్రమంగా, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ ను డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్యన మసీదు నిర్మించ‌డం వ‌ల్ల గ్రామ‌స్తులు ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని, గ్రామంలో మసీదు నిర్మాణం నిలిపివేసి ప్ర‌భుత్వ స్థ‌లాన్ని కాపాడాల‌ని గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు.

Courtesy : VSK Andhra