Home News ‘మా అనుమతి లేని హిందువుల పెండ్లి ఊరేగింపుపై దాడులు చేస్తాం’ : ముస్లిం నాయ‌కుడి హెచ్చ‌రిక‌

‘మా అనుమతి లేని హిందువుల పెండ్లి ఊరేగింపుపై దాడులు చేస్తాం’ : ముస్లిం నాయ‌కుడి హెచ్చ‌రిక‌

0
SHARE

“మా ముస్లిముల అనుమతి లేనిదే హిందువులు ఊరేగింపులు చేయరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ఊరేగింపులు చేస్తే, వాటిని మేము అడ్డుకుంటాం. మీరేం చేస్తారో చేయండి మేమైతే అనుమతి ఇవ్వము” అంటూ ఉత్తర ప్రదేశ్ ఓవైసీ యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడు ఏఐఎంఐఎం నాయకుడు సయ్యద్ నజీమ్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

మే 26న పశ్చిమ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో ని నూర్పూర్ గ్రామంలో హిందువుల వివాహ వేడుక సందర్బంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో స్థానిక మసీదు నుండి రాళ్ళు వేసి, పెండ్లి బృందం పై దాడి చేశారు.

నూర్పూర్ గ్రామం ముస్లిం అధిక జనాభా ఉన్న గ్రామం, 800 కుటుంబాలు ముస్లింల వి కాగా 125 కుటుంబాలు హిందువులవి. ఈ హిందువులంతా జాతవ్ అని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లింల వరుస దాడులు స్థానికుల భయాందోళనలతో ఇళ్లను అమ్ముకోడానికి అయిష్టంగానే మొగ్గు చూపుతున్నారు. స్థానిక ఎస్పీ శుభ‌మ్ పాటిల్ ఆ గ్రామాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ల ఇండ్ల‌కు ఇల్లు అమ్మ‌బ‌డును అనే పోస్ట‌ర్‌ను గ‌మ‌నించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.